వేసవి ప్రత్యేక రైళ్లు…ఏ వారమో తెలుసుకోండి..!

Date:

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) పలు కీలక మార్గాల్లో ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ 2026 వరకు ఈ పొడిగించిన సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

చార్లపల్లి – రక్సాల్ (07007/07008): చార్లపల్లి నుంచి ప్రతి బుధవారం (ఏప్రిల్ 15 – జూన్ 24), రక్సాల్ నుంచి ప్రతి శుక్రవారం (ఏప్రిల్ 17 – జూన్ 26) మొత్తం 11 సర్వీసులు నడపబడతాయి.

చార్లపల్లి – తిరుచిరాపల్లి (07615/07616): చార్లపల్లి నుంచి ప్రతి మంగళవారం (ఏప్రిల్ 14 – జూన్ 2), తిరుచిరాపల్లి నుంచి ప్రతి బుధవారం (ఏప్రిల్ 15 – జూన్ 3) 8 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

సికింద్రాబాద్ – శ్రీకాకుళం (26 సర్వీసులు): ఏప్రిల్ 5 నుండి జూన్ 28 వరకు ప్రతి ఆదివారం సికింద్రాబాద్ నుంచి, సోమవారం శ్రీకాకుళం నుంచి ఈ రైళ్లు నడుస్తాయి.

తిరుపతి – రక్సాల్ (07051/07052): ఏప్రిల్ 13 నుండి మే 28 వరకు ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

బెంగళూరు – బీదర్/కలబురగి: ఏప్రిల్ చివరి వరకు పలు ప్రత్యేక సర్వీసులను పొడిగించారు. తిరుపతి-అకోలా, కాచిగూడ-తిరుచానూరు, సికింద్రాబాద్-అనకాపల్లి, హైదరాబాద్-బెల్గావి, కాకినాడ టౌన్-లింగంపల్లి వంటి మార్గాల్లో కూడా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...