చిన్నారికి శ‌స్ర్త చికిత్స విజ‌య‌వంతం…సిటి న్యూరో వైద్యుల ఘ‌న‌త‌…!

Date:

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: అరుదైన మెదడు రక్తనాళ వ్యాధితో బాధపడుతున్న ఏడాదిన్నర వయసున్న చిన్నారికి బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూరో సర్జరీ విభాగం డాక్టర్ రవి వర్మ, పద్మశ్రీ వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లాకు చెందిన రవి అఖిల దంపతుల కుమారుడు రక్షిత్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

చిన్నారికి న్యూరో సమస్య ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు న్యూరో సర్జన్ ను కలవాల్సిందిగా సూచించడంతో వారు బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో వైద్యులను సంపాదించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారి బాబుకు మెదడులో రక్తనాళ వ్యాధి రైట్ పోస్టిరీయర్ సెరిబ్రల్ ఆర్టరీ లో లార్జ్ ఫ్యూసిఫార్మ్ అన్యూరిజం వ్యాధితో బాధ పడుతున్నట్లుగా గుర్తించారు. ఈ వ్యాధి వల్ల చిన్నారికి ప్రాణాపాయస్థితి ఉంటుందని ప్రతి పది లక్షల మంది చిన్నారుల్లో ఒకటి లేదా రెండు కేసులు మాత్రమే ఇలా ఉంటాయని డాక్టర్ రవి వర్మ తెలిపారు.

చిన్నారికి మెదడులో ఉబ్బిన రక్తనాళానికి అత్యంత జాగ్రత్తగా సర్జరీ చేసి విజయవంతం అయినట్లు వారు తెలిపారు. చిన్నారుల్లో ఇలాంటి అన్యూరిజమ్‌లు అత్యంత అరుదుగా ఉంటాయని ఈ పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సమన్వయంతో అధునాతన చికిత్సను నిర్వహించినట్లు తెలిపారు. అత్యాధునిక న్యూరో ఇంటర్వెన్షన్ విధానం అయిన కాయిల్ ఎంబోలైజేషన్ తో పాటు పేరెంట్ ఆర్టరీ ఓక్లూజన్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ అనస్థీషియా వైద్యులు కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...