మ‌ద‌న‌ప‌ల్లిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం…ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం…!

Date:

మదనపల్లి, క్రైమ్ మిర్ర‌ర్‌: మ‌ద‌న‌ప‌ల్లి మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుంకుంది. మండలంలోని సిటిఎం కంకర ఫ్యాక్టరీ వద్ద కారు ఇన్నోవా ఎదు రెదురు ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై తాలూకా సిఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు. మండలంలోని కొత్తవారిపల్లి పంచాయతీ, పూలవండ్లపల్లి కు చెందిన శేషాద్రి రమణ 36 సిటిఎం ఇండియన్ బ్యాంకులో అటెండర్ గా పనిచేసే విధులు ముగించుకుని బైకులో ఇంటికి బైక్ లో బయలుదేరాడు. స్కూటర్ మార్గమధ్యంలోని కంకర ఫ్యాక్టరీ సమీపంలోకి వెళ్ళగానే మదనపల్లె దేవత నగర్ ముజీబ్ నగర్ లకు చెందిన జావీద్, అస్లాం, ముబారక్ మరో యువకుడు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు బైక్ ను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో స్కూటర్ లో వెళుతున్న శేషాద్రి రమణ అక్కడి కక్కడే దుర్మరణం చెందగా, కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టి అందులో ఉన్న ఓ 13 ఏళ్ళ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ముగ్గురిని వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...