ఆపరేషన్ ఐలాపూర్…6 అంత‌స్తుల భ‌వ‌నం నేల‌మ‌ట్టం…!

Date:

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్:హైద‌రాబాద్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో శ‌నివారం తెల్లవారుజాము నుంచే అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. ప్రభుత్వ భూమి రక్షణ: ఐలాపూర్ పరిధిలోని సర్వే నంబర్లు 164 నుండి 168 మధ్య ఉన్న సుమారు 860 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుండి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దాదాపు రూ. 15,000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

ఆక్రమణదారులు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నప్పటికీ, ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ నిర్మాణాలు కొనసాగించారని అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 6 అంతస్తుల భారీ భవనాన్ని హైడ్రా యంత్రాలు నేలమట్టం చేశాయి. ఈ భూముల్లో ఎలాంటి ప్లాట్లు గానీ, విల్లాలు గానీ కొనుగోలు చేయవద్దని హైడ్రా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆక్రమణలకు గురైన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, అక్కడ ప్రభుత్వ భూమి అని తెలిపే బోర్డులను ఏర్పాటు చేశారు.

అధికారుల ఉక్కుపాదం: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైడ్రా దూకుడు పెంచింది. ఎవరైనా సరే రాజకీయ నాయకులు లేదా రియల్ ఎస్టేట్ మాఫియా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...